Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘మిస్టర్ పెళ్లి కొడుకు’ సెన్సార్ రిపోర్ట్-రిలీజ్ వాయిదా
హైదరాబాద్: సునీల్ హీరోగా రూపొందుతున్న 'మిస్టర్ పెళ్లి కొడుకు' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేసింది. దేవి ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగాసూపర్ గుడ్ ఫిలింస్ సంస్థపై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. హిందీలో హిట్టయిన 'తను వెడ్స్ మను' చిత్రానికి ఇది రీమేక్.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేస్తామని ఆ మధ్య ప్రకటించినప్పటికీ తాజాగా రిలీజ్ డేట్ మార్చారు. మార్చ్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ...'ఇటీవల విడుదలైన మిస్టర్ పెళ్లి కొడుకు ఆడియోకు మంచి స్పందన వస్తోంది. సునీల్ తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. సునీల్-ఇషా చావ్లా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది' అన్నారు.
మరో నిర్మాత పారస్ జైన్ మాట్లాడుతూ 'సునీల్తో మా సంస్థ తీసిన అందాల రాముడు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం కూడా మాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది' అన్నారు. సునీల్ సరసన ఇషా చావ్లా నటించిన ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్.బి.శ్రీరామ్, ఆహుతిప్రసాద్, రవిబాబు, ఎం.ఎస్. నారాయణ, తులసి, ఉషశ్రీ, అర్చన, భవాని ముఖ్య పాత్రలు పోషించారు. విలన్ గా విన్సెంట్ అనే కొత్త నటుడు పరిచయం అవుతున్నాడు.
ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్, కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎం.ఎస్. రవికుమార్, ఫైట్స్: కనల్ కణ్ణన్, ఎడిటింగ్: నందమూరి హరి, కో డైరెక్టర్స్: ఎన్.బ్రహ్మాజీ, విజయ్ కుమార్, ప్రొడక్షన్: భీమనేని రాయుడు, సమర్పణ: ఆర్.బి.చౌదరి, నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవిప్రసాద్.