Don't Miss!
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సునీల్ ‘మిస్టర్ పెళ్లికొడుకు’ రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్ : సునీల్ హీరోగా రూపొందుతున్న 'మిస్టర్ పెళ్లి కొడుకు' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దేవి ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగాసూపర్ గుడ్ ఫిలింస్ సంస్థపై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ...'ఇటీవల విడుదలైన మిస్టర్ పెళ్లి కొడుకు ఆడియోకు మంచి స్పందన వస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సునీల్ తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. సునీల్-ఇషా చావ్లా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది' అన్నారు.
మరో నిర్మాత పారస్ జైన్ మాట్లాడుతూ 'సునీల్తో మా సంస్థ తీసిన అందాల రాముడు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం కూడా మాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తాం. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది' అన్నారు.
సునీల్ సరసన ఇషా చావ్లా నటించిన ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్.బి.శ్రీరామ్, ఆహుతిప్రసాద్, రవిబాబు, ఎం.ఎస్. నారాయణ, తులసి, ఉషశ్రీ, అర్చన, భవాని ముఖ్య పాత్రలు పోషించారు. విలన్ గా విన్సెంట్ అనే కొత్త నటుడు పరిచయం అవుతున్నాడు. ఈచిత్రానికి సంగీతం : ఎస్.ఏ.రాజ్ కుమార్, కెమెరా : సమీర్ రెడ్డి, ఆర్ట్ : ఎం.ఎస్. రవికుమార్, ఫైట్స్ : కనల్ కణ్ణన్, ఎడిటింగ్ : నందమూరి హరి, కో డైరెక్టర్స్ : ఎన్.బ్రహ్మాజీ, విజయ్ కుమార్, ప్రొడక్షన్ : భీమనేని రాయుడు, సమర్పణ : ఆర్.బి.చౌదరి, నిర్మాతలు : ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం : దేవిప్రసాద్.