Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
'జపం' టైటిల్ తో ఎమ్.ఎస్ రాజు కొత్త చిత్రం
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు ..నిర్మాత నుంచి దర్శకుడుగా షిఫ్ట్ అయిన వద్ద నుంచి ఆయనకు సక్సెస్ లు కరువయ్యాయి. వాన చిత్రం డిజాస్టర్ ఫలితం ఇచ్చినా తర్వాత తూనీగ తూనీగ అంటూ ఆయన కుమారుడుని లాంచ్ చేసారు. ఆ చిత్రం టీవీ సీరియల్ తరహాలో ఉందంటూ విమర్శలు వచ్చి ఫ్లాప్ అయ్యింది. తర్వాత ముగ్గురు హీరోయిన్స్ తో రమ్ అనే చిత్రం మొదలెట్టారు. ఆ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కే ఆర్ధిక ఇబ్బందులలో ప్యాకప్ అంది. ఈ నేపధ్యంలో ఆయన ఇప్పుడు 'జపం' టైటిల్ తో మరో చిత్రం చేయటానికి సిద్దమవుతున్నారు. ఈ సారి ఆయన దర్శకత్వం వహించబోయే చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్.
ఆయనే కథ,దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగులు ఇష్క్ ఫేమ్ రమేష్ సామల అందిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. మే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతా కొత్త వాళ్లతో ఈ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ జపం అనే అర్దం లో ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. ఈ సినిమాపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఇక ఎమ్.ఎస్.రాజు స్వీయ దర్శకత్వంలో'రంభ ఊర్వశి మేనక' ('రమ్' )అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, నికీషా పటేల్, ఇషా చావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఫైనాన్సియల్ క్రైసిస్ లో ఇరుక్కుని ఆగిపోయింది. ఈ చిత్రం మేజర్ షెడ్యూల్స్ రెండు జరిగి మూడో షెడ్యూల్ వద్ద ఆగిపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే అనుకోని విధంగా ఆర్దిక ఇబ్బందులు రావటంతో ఎమ్.ఎస్ రాజు చేతులెత్తేసారని చెప్పుకుంటున్నారు.