Don't Miss!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
కొట్టుకుంటూ ప్రేమించుకుంటూ...('తూనీగా తూనీగ 'ప్రివ్యూ)
కథలో .. సంగీతమే ప్రాణంగా భావించే యువకుడు కార్తీక్ రామస్వామి (సుమంత్ అశ్విన్). ఆ యువకుడికి కొన్ని లక్ష్యాలుంటాయి. వాటిని చేరుకొనే క్రమంలోనే నిధి (రియా) పరిచయమవుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. నిధి అభిరుచులు భిన్నమైనవి. జంతువులంటే ఎంతో ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటుంది. వీళ్ళిద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఇద్దరి మధ్య మంచి నీళ్లు ఉన్నా కూడా పెట్రోలై మండుతుంది. 'నువ్వెంత అంటే నువ్వెంత' అనుకొంటూ పోట్లాడుకోవల్సిందే. ఒకరిని ఓడించడానికి మరొకరు ఎత్తులు వేస్తుంటారు. అలాంటిది ఇద్దరూ ఒక చోట కలిసుండాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్దవారి కోసం స్నేహం నటించాల్సి వస్తుంది. అప్పుడేం చేశారు? కొత్తగా వచ్చిన పిలుపులు, పలకరింపులు... వారి మధ్య ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి అనేది మిగతా కథ.
సమర్ఫకుడు దిల్ రాజు మాట్లాడుతూ...మేకర్గా ఎమ్మెస్ రాజు ప్రతిభ ఏమిటో తెలుసు. వాళ్ల అబ్బాయినే హీరోగా పరిచయం చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా బాగుంటుందనే ఉద్దేశంతో మాగంటి రాంజీతో పాటు నిర్మాణంలో నేనూ పాలు పంచుకున్నా. నా సొంత సినిమాకి ఎలాగైతే అన్ని విషయాలూ చూసుకుంటానో అలాగే ఈ సినిమాకీ చేయాలని నిర్ణయించుకుని 70 శాతం షూటింగ్ అయ్యాక రషెస్ చూపించమన్నా. అప్పటికి క్లైమాక్స్, కొన్ని కీలక సన్నివేశాలు తియ్యలేదు. అందులో పొరబాట్లుగా నాకు అనిపించినవీ, నాకు కలిగిన సందేహాలనూ చెప్పాను. రచయితలు పరుచూరి బ్రదర్స్తో చర్చించా. ఈ సినిమాని సూపర్హిట్ చెయ్యాలంటే ఏం చెయ్యొచ్చో వాటిని అందరినీ కూర్చోపెట్టి చర్చించాను. అప్పటివరకు జరిగిన షూటింగ్లో ఎక్కడ మార్పులు చెయ్యాలో, తర్వాత కథ ఎలా ఉండాలో అందరం కలిసి నిర్ణయించుకున్నాం. రాజుగారు కూడా కన్విన్స్ అయ్యారు. దానికి తగ్గట్లే సినిమా తీశారు అన్నారు.
సంస్థ:
పద్మిని
ఆర్ట్స్
నటీనటులు:
సుమంత్
అశ్విన్,
రియా,
పరుచూరి
వెంకటేశ్వరరావు,
ప్రభు,
నాగబాబు,
విజయ్చందర్,
సాయాజీ
షిండే
తదితరులు
మాటలు:
పరుచూరి
బ్రదర్స్,
కెమెరా:
ఎస్.గోపాల్రెడ్డి,
కథ,స్క్రీన్ప్లే,దర్శకత్వం:
ఎం.ఎస్.రాజు
సమర్పణ:
దిల్
రాజు,
నిర్మాత:
మాగంటి
రామ్చంద్రన్
(రామ్జీ),
విడుదల:
శుక్రవారం.