Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఘనంగా 'ముద్దుగా' లోగో ఆవిష్కరణ
హైదరాబాద్: విక్రాంత్, పల్లవి ఘోష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ముద్దుగా'. 24 ఫ్రేమ్స్ పతాకంపై సి.వి. రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీశ్కుమార్ దర్శకుడు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా లోగో, టీజర్ను నిర్మాతల మండలి హాలులో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సినీ పాత్రికేయుడు పసుపులేటి రామారావు ఆవిష్కరించారు.
దర్శకుడు సతీశ్కుమార్ మాట్లాడుతూ "మంచి కథ, మంచి సంగీతం, నాణ్యతతో రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది మానవ విలువలు, ఫ్యామిలీ డ్రామా మేళవించిన చిత్రం. కీరవాణి వద్ద అసోసియేట్గా పనిచేస్తున్న ఎమ్.పి. రామన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం'' అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ- ముద్దుగా ఓ అమ్మాయి, ముద్దుగా ఓ అబ్బాయి, ఇద్దరిమధ్య ముద్దుముద్దుగా ఓ అందమైన ప్రేమకథ, మానవ సంబంధాలమధ్య అల్లుకున్న సున్నితమైన రొమాంటిక్ కామెడీ చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందరూ కొత్త నటీనటులు, టెక్నీషియన్లు పరిచయమవుతున్నారని, హైదరాబాద్, వైజాగ్, అరకు ప్రాంతాలలో మూడు షెడ్యూల్స్లో జరిపామని, త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
సహ నిర్మాతల్లో ఒకరైన రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ "డైరెక్టర్ చాలా బాగా చిత్రాన్ని రూపొందించారు. అక్టోబర్లో పాటల్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు. చిత్రంలో ఐదు పాటలున్నాయనీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నామనీ లైన్ ప్రొడ్యూసర్ బాచి పవార్ తెలిపారు. చలపతిరాజు, మమతారెడ్డి, జానకీరామ్, లీలాకృష్ణ, సూర్య, కిశోర్, సృజన, మహిమ, నాని, భావన తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: గోపరాజు, ఛాయాగ్రహణం: ఎస్.వి. ప్రసాద్, సహ నిర్మాతలు: రామకృష్ణారెడ్డి, చంటి, జానకీరామ్.