Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీకాంత్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్: భార్యతో కలిసి హాజరైన ముఖేష్ అంబానీ
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతరు సౌందర్య వివాహం అపెక్స్ లాబోరేటరీస్ డైరెక్టర్ విశాగన్తో ఫిబ్రవరి 11 వైభవంగా జరిగింది. చెన్నైలోని లీలా ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
పెళ్లి అనంతరం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. కొత్త దంపతులను ఆశీర్వదించడానికి పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ముంబై నుంచి భారత కుబేరుడు, రిలయన్స్ గ్రూఫ్ అధినేత ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీతో కలిసి రావడం విశేషం.
నెల రోజుల క్రితం ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన ఆయన కూతురు ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్ పెళ్లి వేడుకకు రజనీకాంత్ తన భార్యతో కలిసి అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ దంపతులతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
సౌందర్య దర్శకురాలిగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. విశాగన్ గతేడాది 'వంజగర్ ఉలగమ్' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. సౌందర్య మొదటి వివాహం అశ్విన్ రామ్ కుమార్తో 2010 జరిగింది. 2016లో వీడిపోయారు. వీరికి వేద్ కృష్ణ అనే బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే.