Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
27 ఏళ్ల తర్వాత: SVSCపై దిల్రాజు, ఎన్టీఆర్తో చేస్తా
విజయనగరం: తెలుగు సినీ పరిశ్రమలో విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబులతో తాను మల్టీస్టారర్ చిత్రాన్ని చాన్నాళ్ల తర్వాత నిర్మిస్తున్నానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురువారం అన్నారు. దిల్ రాజు ఈ రోజు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో నూతనంగా నిర్మించిన వంశీవిష్ణు థియేటర్ను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పైరసీని అరికట్టడం ప్రేక్షకుల చేతిలోనే ఉందని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు వారి సహకారం కూడా కావాలన్నారు. ఇరవై ఏడేళ్ల తర్వాత తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో మహేష్ బాబు, వెంకటేష్లతో మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఈ ఏడాదే విడుదల చేస్తామని అన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్తో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా మరో సినిమా చేస్తానని దిల్ రాజు చెప్పారు. కాగా వెంకటేష్, మహేష్ బాబులు కథానాయకులుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
మల్టీస్టారర్గా రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా రూపొందుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్గా ఫోకస్ కానుంది.