Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
వీణా మాలిక్... మణిశర్మ కు రిలీఫ్ ఇస్తుందా?
హైదరాబాద్ : వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా, వేదిత ప్రతాప్ సింగ్, అపర్ణ బాజ్పాయ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం 'ముంబై 125 కిమీ'. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలం అయ్యినా ఆర్దిక సమస్యలతో విడుదలకు నోచుకోలేదు.
ఈ మధ్య మణిశర్మ ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ చాలా బాధపడ్డారు కూడా. ఇప్పుడీ చిత్రం విడుదలై ఆయనకు రిలీఫ్ ఇస్తుందా లేదా అన్నది అందరికీ ఆసక్తి కలిగించే అంశం. వీణామాలిక్ ఉంది కాబట్టి ఓపినింగ్స్ వచ్చే అవకాసం ఉందని, అయితే చిత్రం ఏ మేరకు విషయం ఉందనే విషయమై సినిమా విజయం ఆధారపడుతుందని ట్రేడ్ లో అంటున్నారు.
సినిమాలు తీసి బాగుపడ్డవాడు ఎవడూ లేడని తెలిసి కూడా నేను ఆ తప్పు చేశాను. చాలా నష్టం అనుభవిస్తున్నాను. 'ముంబై 125 కి.మీ' త్రీడీ హారర్ సినిమా హిందీలో నిర్మించాను. చేతులు కాలాయి. పట్టుకోవడానికి ఆకులు కూడా లేవు అన్నారు అంటూ బాధపడ్డారు మణిశర్మ.
''ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే చిత్రమిది. ముంబైకు 125 కిమీల దూరంలో ఏం జరిగిందో తెరపై చూడాల్సిందే'' అంటున్నారు దర్శకుడు. ''రియల్ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కించాం. వచ్చే నెలలో పాటలను విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్ షాయ్, కూర్పు: సందీప్