Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కంగనా సిస్టర్ కు సమన్లు జారీచేసిన ముంబై పోలీస్
వివాదాలను వెత్తుకుంటూ వెళ్లడం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ బ్యూటీ సోదరి రంగోలి కంగనాకు కవచంలా ఉండటానికి విశ్వప్రయత్నాలు చేస్తూఉంటుంది . ఎవరైనా తన సోదరిగురించి కామెంట్ చేస్తే చీల్చి చండాడుతుంది . ఈ అక్క చెల్లెళ్ళతో మనకెందుకులే అని బాలీవుడ్ లో చాలామంది సైలెంట్ అయిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా ఈ సిస్టర్స్ కొత్త చిక్కుల్లో పడ్డారు. ఈ అక్కాచెల్లెళ్ల పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు. ముంబైపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగన - రంగోలి సిస్టర్స్ పై దేశద్రోహ కేసు నమోదైంది. ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తో పోల్చిన తరువాత శివసేన వర్సెస్ కంగనా రనౌత్ ఎపిసోడ్స్ తెలిసినదే. ముంబైలో నివసించేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని కంగన ఆమధ్య సంచలన కామెంట్లు చేసింది.
తాజా సమాచారం ప్రకారం.. కంగన రనౌత్.. ఆమె సోదరిని ముంబై పోలీసులు ప్రశ్నించేందుకు సమన్లు పంపారని తెలుస్తుంది. కంగన ముంబై పరువు తీయడంతో పాటు.. తన ట్వీట్ల ద్వారా మత విభేదాలను సృష్టిస్తున్నారని ఆరోపించిన కాస్టింగ్ డైరెక్టర్ పిటిషన్ కు ప్రతిస్పందనగా.. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని కోర్టు తెలిపింది.
రనౌత్.. రంగోలి లను అక్టోబర్ 26.. అక్టోబర్ 27 తేదీల్లో దర్యాప్తు అధికారి ముందు హాజరుపరచాలని సమన్లలో కోరారు. మరి ఈ ఎపిసోడ్ ఇక ముందు ఎంత దూరం వెళుతుందో చూడాలి.