Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కంగనా సిస్టర్ కు సమన్లు జారీచేసిన ముంబై పోలీస్
వివాదాలను వెత్తుకుంటూ వెళ్లడం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ బ్యూటీ సోదరి రంగోలి కంగనాకు కవచంలా ఉండటానికి విశ్వప్రయత్నాలు చేస్తూఉంటుంది . ఎవరైనా తన సోదరిగురించి కామెంట్ చేస్తే చీల్చి చండాడుతుంది . ఈ అక్క చెల్లెళ్ళతో మనకెందుకులే అని బాలీవుడ్ లో చాలామంది సైలెంట్ అయిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా ఈ సిస్టర్స్ కొత్త చిక్కుల్లో పడ్డారు. ఈ అక్కాచెల్లెళ్ల పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు. ముంబైపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగన - రంగోలి సిస్టర్స్ పై దేశద్రోహ కేసు నమోదైంది. ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తో పోల్చిన తరువాత శివసేన వర్సెస్ కంగనా రనౌత్ ఎపిసోడ్స్ తెలిసినదే. ముంబైలో నివసించేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని కంగన ఆమధ్య సంచలన కామెంట్లు చేసింది.
తాజా సమాచారం ప్రకారం.. కంగన రనౌత్.. ఆమె సోదరిని ముంబై పోలీసులు ప్రశ్నించేందుకు సమన్లు పంపారని తెలుస్తుంది. కంగన ముంబై పరువు తీయడంతో పాటు.. తన ట్వీట్ల ద్వారా మత విభేదాలను సృష్టిస్తున్నారని ఆరోపించిన కాస్టింగ్ డైరెక్టర్ పిటిషన్ కు ప్రతిస్పందనగా.. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని కోర్టు తెలిపింది.
రనౌత్.. రంగోలి లను అక్టోబర్ 26.. అక్టోబర్ 27 తేదీల్లో దర్యాప్తు అధికారి ముందు హాజరుపరచాలని సమన్లలో కోరారు. మరి ఈ ఎపిసోడ్ ఇక ముందు ఎంత దూరం వెళుతుందో చూడాలి.