Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ముమైత్ ఖాన్ సైతం... హాట్ డాన్స్ (వీడియో)
హైదరాబాద్ :ఎప్పుడో కానీ బయటికు రాని సినీ తారలంతా 'మేముసైతం' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి కలిసికట్టుగా వినోదాలు పంచారు. సాటి మనుషుల్ని ఆదుకోవడం మనందరి బాధ్యత అనే సందేశాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరవేశారు. హైదరాబాద్లో ఆదివారం 12 గంటలపాటు 'మేముసైతం' పేరిట టెలీథాన్ సాగింది. ఈ వేడుకలో చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, గాయకులు, సాంకేతిక నిపుణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో భాగంగా 'ఇప్పటికింకా నా వయసు..'అంటూ ముమైత్ ఖాన్ తన పాటలతో హోరెత్తించింది. ఆ వీడియో మీరూ చూడండి.
హుద్ హుద్ తుపాను బాధితుల కన్నీటిని తుడవడమే లక్ష్యంగా చలన చిత్ర పరిశ్రమ అంతా ఒక తాటిపైకి వచ్చింది. మీకు అండగా మేమున్నాం... మీ పెదాలపై మేం చిరునవ్వుని అవుతాం అంటూ భరోసానిచ్చింది. ఉదయం 10 గంటలకు మేముసైతం... అంటూ పి.సుశీల బృందం పాడిన పాటతో వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఆ తర్వాత పాటలు, డ్యాన్సులు, కబడ్డీ, ముఖాముఖి, క్రికెట్టు, తంబోలా, అంత్యాక్షరి కార్యక్రమాలు సందడిగా సాగాయి. చిన్న పెద్ద, నాయకానాయికలు అనే తేడా లేకుండా నటీనటులంతా అందరూ కలిసిపోయి ప్రేక్షకులకు వినోదాలు పంచే ప్రయత్నం చేశారు. చిత్ర పరిశ్రమ అంతా ఒక వేదికపై కనిపించడంతో ప్రేక్షకులు పులకరించిపోయారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ దాతలు స్పందించి విరాళాలు ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘంతో పాటు పలువురు నటీనటులు హుద్ హుద్ బాధితుల సహాయార్థం విరాళాన్ని ప్రకటించారు.
దాసరి మాట్లాడుతూ...'పరిశ్రమకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి పైకి తీసుకొచ్చినవాళ్లు ప్రేక్షకులు. అలాంటివారికి కష్టాలు వచ్చినప్పుడు మేము సైతం ఏదో ఒకటి చేయాలని చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. రూపాయి అని కాదు, కోటి రూపాయలు అని కాదు కష్టంలో ఉన్నప్పుడు మేమున్నాం అని ఇచ్చే భరోసా, స్ఫూర్తికోసమే ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల సమయంలో సినిమావాళ్లు వేరు వేరు అని ప్రచారం చేస్తుంటారు. అది నిజం కాదు. తెర ఉన్నంతవరకు సినిమా పరిశ్రమ ఒక్కటే. ఈ స్ఫూర్తి రాబోయే తరమూ కొనసాగించాలి. ఇలాంటి విపత్తులు రాకూడదని మనమంతా కోరుకొందాం'' అన్నారు.