Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
టీవీ నటి మృతి వెనక అసలు కథ..భర్త అరెస్టు
దీంతో సురేంద్రను పెళ్లి చేసుకోవాలని హేమాశ్రీపై తండ్రి ఒత్తిడి చేశారు. ఆమె ఒప్పుకోలేదు. తీవ్ర ఒత్తిళ్లు రావడంతో గత్యంతరం లేక అంగీకరించింది. గత ఏడాది జూన్ 24వ తేదీన సురేంద్రతో తిరుపతిలో పెళ్లి జరిగింది. ఆ సమయంలో సురేంద్రకు 35 ఏళ్లని నమ్మించారని, కానీ ఆయనకు 48 ఏళ్లు ఉన్నాయని హేమాశ్రీ తెలుసుకుంది. వివాహమైన రెండు రోజుల్లో అంటే జూన్ 26వ తేదీ ఇదే విషయాన్ని చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భర్త, తన ఇతర కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఆమె స్వదస్తూరితో రాసి ఫిర్యాదు చేశారు. వివాహ జీవితం కూడా సాఫీగా సాగడం లేదని ఆమె తన సహ కళాకారులతో గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. అయితే అల్లుడు, కుమార్తె చక్కని జీవితాన్ని సాగిస్తున్నారని, వారి మధ్య విభేదాలు లేవని తండ్రి నాగరాజు మీడియాతో చెప్పారు. హెబ్బాళ పోలీసుల కథనం వేరుగా ఉంది. ఆసుపత్రికి తీసుకురావటానికి ఎనిమిది గంటల ముందే ఆమె మృతి చెందిందని బాప్టిస్ట్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో సురేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
భర్త ఏమన్నారంటే... 'చెన్నైలో ఒక తమిళ ధారావాహిక చిత్రీకరణ పూర్తి చేసుకుని బస్సులో బెంగళూరుకు వస్తుండగా హేమాశ్రీకి వాంతులయ్యాయి. బెంగళూరు చేరుకున్న తరువాత చెన్నమ్మనకెరె అచ్చుకట్టులోని ఇంట్లో కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తరువాత అనంతపురం వెళ్లేందుకు కారులో బయలుదేరాం. నగర శివార్లకు చేరుకున్న తరువాత ఆమె అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం బాప్టిస్ట్ ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించానని' హేమాశ్రీ భర్త సురేంద్రబాబు (48) పోలీసులకు తెలిపాడు.
సుమనహళ్లిలోని విద్యుత్ స్మశాన వాటిక బుల్లితెర నటీ నటులు, సాంకేతిక వర్గ ప్రతినిధులు, కుటుంబ సభ్యుల ఆక్రందనలతో నిండిపోయింది. బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఉన్న హేమాశ్రీ మృతదేహాన్ని బుధవారం ఉదయం 5 గంటలకు విక్టోరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఉదయం 11 గంటల వరకు ఆమె కుటుంబ సభ్యులు అక్కడకు రాలేదు. బుల్లితెర నటులు మాత్రమే అక్కడ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తిచేశారు. గురువారం సాయంత్రానికి నివేదిక వస్తుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముక్కుపైన, కడుపులో గాయాలున్నాయని, జీర్ణాశయంలో నల్లని ద్రవం ఉందని తేలింది. ఈ నమూనాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఆమెది అనుమానాస్పద మరణమని వైద్యులు స్పష్టంచేశారని పోలీసులు తెలిపారు.
ఒక ప్రైవేటు ఛానల్లో వ్యాఖ్యాతగా జీవితాన్ని మొదలుపెట్టిన హేమాశ్రీ వీరపరంపర, విష్ణుసేన, వర్ష, జిందగీ, కీర్తి తదితర చిత్రాల్లో నటించారు. పలు కన్నడ సీరియళ్లలో హీరోయిన్ పాత్రల్ని పోషించారు. కొద్దికాలంలో తమిళ ధారావాహికల్లో కూడా పాత్రల్ని పోషిస్తూ బిజీగా మారారు. తన కెరీర్ ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడే అనుమానస్పద రీతిలో అందరికీ దూరమయ్యారు.