Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
క్యాన్సర్తో కన్నుమూసిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్
ముంబై: బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు ఆదేశ్ శ్రీవాత్సవ(51) క్యాన్సర్ తో కన్నుమూసారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అందేరిలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి దాటిని తర్వాత 12.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. 2011 నుండి ఆదేశ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. అయితే గత 40 రోజులు నుండి వ్యాధి తీవ్రత ఎక్కువైంది.
కెరీర్లో ఆదేశ్ శ్రీవాత్సవ దాదాపు 70కి పైగా చిత్రాలకు చిత్రాలకు సంగీతం అందించారు. ఛల్తే ఛల్తే, బాగ్బన్, కబీ ఖుషీ కబీ గమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. తాజాగా విడుదలైన వెల్ కం బ్యాక్ ఆయన సంగీతం అందించిన చివరి సినిమా. కొన్ని చిత్రాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.
గాయకుడిగానూ సినీ రంగానికి తన సేవలు అందించారు. మాజీ నటి విజేత పండింత్ ను వివాహమాడిన ఆయనకు అనివేష్, వితేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆదేశ్ ఆసుపత్రిలో ఉండగా పలువురు సినీ ప్రముఖులు వచ్చి పరామర్శించి వెళ్లారు. ఆయన మరణంతో బాలీవుడ్ సంగీత ప్రపంచం విషాదంలో మునిగి పోయింది.