Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి థ్యాంక్స్: వర్మపై కీరవాణి ట్వీట్..
Recommended Video
రాంగోపాల్ వర్మ 'గాడ్ సెక్స్&ట్రూత్' సినిమాకు కీరవాణి సంగీతం అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. కీరవాణి ఒక బూతు సినిమాకు సంగీతం అందించడమేంటి? అని చాలామంది నోరెళ్లబెట్టారు. అయితే తాను చెప్పిన కథలోని ఇంటెన్సిటీ, తాత్వికతను అర్థం చేసుకున్నందువల్లే కీరవాణి ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారని వర్మ తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా వర్మను పిచ్చి దర్శకుడు అంటూ కీరవాణి ట్విట్టర్ లో ట్వీట్ చేయడం గమనార్హం.
'హోమో సెక్సువల్' ఆరోపణలపై వర్మ మౌనం: స్పందించకపోవడం వెనుక కారణమేంటి?
పిచ్చి దర్శకుడు..: కీరవాణి ట్వీట్
సెల్యులాయిడ్పై పలు రకాల భావాలను పలికించే ఆయన బ్రిలియెన్స్ నా సంగీతాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. 1991లో రొమాన్స్ను, 92లో కామెడీని, 2018లో సెక్స్కు సంగీతం అందించాను. ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతం అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి థాంక్స్.
కీరవాణి-వర్మ:
తెలుగులో తన రెండో సినిమా క్షణ క్షణం(1991) నుంచే కీరవాణితో జర్నీ మొదలుపెట్టారు వర్మ. ఆ తర్వాత అంతం(1992) సినిమాకు ఇద్దరు కలిసి పనిచేశారు. మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరి కలయికలో 'జీఎస్టీ' వచ్చింది.
'జువ్వ'కు కీరవాణి సంగీతం..:
బాహుబలి తర్వాత కీరవాణి కాస్త గ్యాప్ తీసుకున్నారు. 'దిక్కులు చూడకు రామయ్య' ఫేం త్రికోటి దర్శకత్వంలో రంజిత్, పలక్ లల్వాని జంటగా తెరకెక్కుతున్న సినిమా 'జువ్వ' సినిమాకు ఆయన సంగీతం అందించారు. సినిమాలో 'ఓ కల' అంటూ సాగే మెలోడి సాంగ్ లిరికల్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. కీరవాణి తనయుడు కాలభైరవతో కలిసి దామిని ఈ పాట పాడారు.
సాహిత్యాభిరుచి ఉన్నవాడు:
సాహిత్యాభిరుచి, తెలుగు భాషపై మంచి పట్టున్న సంగీత దర్శకుల్లో ఎంఎం.కీరవాణి ఒకరు. సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యతను తగ్గించకుండా.. వినసొంపైన బాణీలను అందించడం ఆయన ప్రత్యేకత. కేవలం పాటలకే కాదు.. నేపథ్య సంగీతం విషయంలో కీరవాణి మార్క్ తప్పకుండా ఉంటుంది.