Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కేవలం శంకర్ కోసమే 'బాయ్స్'లో నటించా
ఓ బర్త్డే పార్టీలో నేను డ్రమ్స్ వాయించడం చూసి శంకర్ 'బాయ్స్' చిత్రలో ఒక హీరోగా అవకాశమిచ్చారు. నాకు నటన అంటే ఆసక్తి లేకపోయినా, శంకర్ తో పనిచేయాలనే ఉత్సాహంతో ఒప్పుకున్నా అంటున్నారు సంగీత దర్శకుడు తమస్. రవితేజ 'కిక్', ఆంజనేయులు, కళ్యాణ్ రామ్ జయాభవ, గోపీచంద్ శంఖం, అమ్మ రాజశేఖర్ బీభత్సం తదితర చిత్రాలకు సంగీతం అందించిన తమస్ తన గతాన్ని తలుచుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. ఇక బోయ్స్ చిత్రం తర్వాత తరువాత లెక్కలేనన్ని అవకాశాలు వచ్చినా, సంగీతాన్నే నమ్ముకోవాలని నిర్ణయించుకుని అన్నింటినీ వదులు కున్నానంటున్నారు.
తనను నటుడుగా పరిచయం చేసిన దర్శకుడు శంకర్ నిర్మించిన 'ఈరమ్' అనే తమిళ చిత్రంతో సంగీత దర్శకుణ్ణయ్యాను అని చెప్తున్నారు. అలాగే గతంలో రవితేజ చాలా సినిమాలకు నేను డ్రమ్మర్గా పనిచేశాను. నాన్న చనిపోయాక రాజ్-కోటి దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్ గా చేరాను. వారి దగ్గరే ఎఆర్ రెహమాన్, మణిశర్మ, హారిస్ జైరాజ్ పనిచేస్తుండేవారు. మేమంతా సరదాగా మాట్లాడు కుంటుండేవాళ్లం. ఆ తరువాత కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, మణిశర్మ, చక్రి, దేవిశ్రీ ప్రసాద్, ఆర్పీ పట్నాయక్ ల దగ్గర రిథమ్ ప్రోగ్రామర్గా పని చేశాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి, దిల్ రాజుల కలయికలో వస్తున్న 'బృందావనం' చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రెడీ అవుతున్న 'మిరపకాయ్' చిత్రానికీ సంగీతం అందిస్తున్నారు.