Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ప్రముఖ మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు ఇకలేరు
సినీ తెరపై మాటలతో మ్యాజిక్ చేసిన రచయిత ఎంవీఎస్ హరనాథ రావు ఇకలేరు. గుండెపోటుకు గురైన ఆయన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ఒంగోలు.
సినీ తెరపై మాటలతో మ్యాజిక్ చేసిన రచయిత ఎంవీఎస్ హరనాథ రావు ఇకలేరు. గుండెపోటుకు గురైన ఆయన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ఒంగోలు. ఎంవీఎస్ హరనాథరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దాదాపు 150 చిత్రాలకు పైగా ఆయన మాటలు అందించారు. ప్రతిఘటన, భారతనారి, స్వయంకృషి, సూత్రధారులు, రాక్షసుడు లాంటి చిత్రాలు మాటల రచయితగా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. హరనాథరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఎంవిఎస్ హరనాధరావు వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి. అందుకే సినిమాల్లో ఆయన రాసిన మాటలు తూటాల్లా పేలేవి. హరనాథరావును ప్రముఖ దర్శకుడు, దివంగత టీ కృష్ణ సినీ తెరకు పరిచయం చేశారు. టీ కృష్ణ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాలకు ఆయనే మాటల రాయడం విశేషం. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం చిత్రాలకు ఉత్తమ సంభాషణల రచయితగా ఆయన నంది అవార్డును కూడా అందుకున్నారు.
హరనాథరావు తెలుగు సినిమా రచయితల సంఘానికి కోఆర్డినేషన్ కమిటీ చైర్ పర్సన్గా వ్యవహరించారు. రక్తబలి, జగన్నాథ రథచక్రాలు వంటి నాటికల్లో కూడా హరనాథరావు నటించారు.