వైఎస్ జగన్ చేతుల మీదుగా మై డియర్ మార్తాండం టీజర్
మజిన్ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న మై డియర్ మార్తాండం చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా కొవ్వూరుకు సమీపంలో జరిగి ఈ కార్యక్రమంలో కమెడియన్ పృథ్వీ, దర్శకుడు హరీష్ కేవి తదితరులు పాల్గొన్నారు.
కోర్టు డ్రామా నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీ, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.



Click it and Unblock the Notifications











