Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వర్మ మా గుండెల్లో చిచ్చు రేపుతున్నాడంటూ ఆవేదన
"మేం ఆ సంఘటనని మరచిపోవాలని అనుకుంటుంటే, ఈ సినిమా ద్వారా వర్మ ఆ గాయాన్ని మళ్లీ రేపుతున్నాడు'' అంటూ నీరజ్ గ్రోవర్ కుటుంబం వాపోతోంది.రాంగోపాల్ వర్మ తాజాగా నీరజ్ గ్రోవర్ హత్య ప్రేరణతో బాలీవుడ్లో రూపొందించిన 'నాట్ ఎ లవ్ స్టోరీ' చిత్రంతో ఈ వివాదం మొదలైంది. వర్మ ఈ సినిమా తీయడంతో నీరజ్ కుటుంబం ఆవేదన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ఎంటర్టైనింగ్ కంపెనీకి క్రియేటివ్ హెడ్గా పనిచేసిన నీరజ్ని 2008 మే 6న అతని మాజీ గర్ల్ఫ్రెండ్ మరియో మోనికా సుసైరాజ్, నేవీలో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న ఆమె బాయ్ఫ్రెండ్ ఎమిలే జెరోమ్ కలిసి దారుణంగా హత్య చేశారు. ఆ దుర్ఘటన నుంచి ఇప్పటికీ నీరజ్ కుటుంబం తేరుకోలేదు. ఇప్పుడు నీరజ్పై వర్మ సినిమా తీశాడనే వార్త వినగానే నీరజ్ తల్లి నీలమ్ గ్రోవర్ ఆవేదన వ్యక్తం చేసింది. వర్మ ఈ పని ఎందుకు చేశాడని బాధపడింది. నీరజ్ అక్క శిఖ సైతం ఈ సినిమా తీయడానికి వర్మ తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపింది.
అయితే వర్మ వాదన అందుకు భిన్నంగా ఉంది. తాను నీరజ్ కథతో ఈ సినిమా తీయలేదనీ, తన సినిమాకి ఆ సంఘటన కేవలం ప్రేరణ మాత్రమేననీ అంటున్నాడు. "నిజంగా జరిగిన హత్యపై నేను ఎలా సినిమా తీయగలను? నేనేమైనా అక్కడనున్నానా? నిజంగా అప్పుడు ఏం జరిగిందో నాకెట్లా తెలుస్తుంది. ఆ సంఘటనని నా సొంత మెదడుతో, నాకు తోచిన రీతిలో తెరమీద ఆవిష్కరించానంతే. అంతేకానీ ఇది నీరజ్ కథతో తీసిన సినిమా కాదు'' అని స్పష్టం చేశాడు. ఈ చిత్రాన్ని నెల రోజుల షూటింగ్తో ఆయన పూర్తి చేశాడు. అది ఎప్పుడు విడుదలయ్యేదీ కొద్ది రోజుల్లో తెలియనుంది.