గర్వంతో హృదయం వాపెక్కింది: జై లవ కుశపై రాజమౌళి, ఇతర స్టార్స్ కామెంట్స్!
జై లవ కుశ సినిమాపై రాజమౌళి ట్వీట్ చేశారు. చాలా గర్వంగా ఉందని ఆయన ప్రశంసించారు.
Recommended Video

జూ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జై లవకుశ' సినిమాకు విడుదలైన అన్ని కేంద్రాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సూపర్ అంటున్నారు. రాశీఖన్నా, నివేథా థామస్ హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో, దేవీశ్రీ సంగీతమందించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్బస్టర్ హిట్ టాక్ వచ్చింది.
ఈనిమాలో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ యాక్టింగుపై, సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హృదయం వాపెక్కిందన్న రాజమౌళి
‘జై లవ కుశ' సినిమా చూసిన అనంతరం రాజమౌళి స్పందించారు. ‘తారక్.... నా హృదయం అపారమైన గర్వంతో వాపెక్కింది. మాటల్లో చెప్పడం సరిపోదు. జై జై... జై లవ కుశ అంటూ ట్వీట్ చేశారు.

గోపీచంద్ మలినేని
జై పాత్రలో ఎన్టీఆర్ తప్ప మరెవరినీ ఊహించుకోలేం. దున్నేశాడు. కంట్రాట్స్ అంటూ.... దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు.

గోపీ మోహన్
మూడు పాత్రలు చేయడం అంటే మామూలు విషయం కాదు, తారక్ అద్భుతంగా చేశాడు, పూర్తి న్యాయం చేశాడు... అంటూ రచయిత గోపీ మోహన్ అన్నారు.

హరీష్ శంకర్
జై లవ కుశ సినిమాపై, తారక్ పెర్ఫార్మెన్స్ పై దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

మంచు లక్ష్మిని విషెస్
జై లవ కుశ టీంను విష్ చేస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

థాంక్స్ చెప్పిన బాబీ
పలువురు ప్రశంసిస్తుండటం, రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో థాంక్స్ చెబుతూ బాబీ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











