Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ వార్త విని మా అమ్మ ఏడ్చింది.. అందుకే అతనికి దూరం.. బండ్ల గణేష్
మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర వ్యక్తులకు బీనామీ అంటూ వచ్చిన వార్తలను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తోసిపుచ్చారు.
మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర వ్యక్తులకు బీనామీ అంటూ వచ్చిన వార్తలను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తోసిపుచ్చారు. రూ.300 కోట్ల పైగా ఆస్తులు, వ్యాపారాలున్నాయని స్పష్టం చేశారు. తన తండ్రి షాద్ నగర్ లో రూ.1.50 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించారని, ప్రస్తుతం కోట్లకు పడుగలెత్తామని ఆయన తెలిపారు.
తన వద్ద అంతమొత్తంలో డబ్బు ఉన్నప్పుడు ఒకరి బినామీగా వ్యవహరించాల్సిన అవసరం లేదని idreampost.com కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
'బొత్స బినామీ అని వచ్చిన వార్త విని మా అమ్మ ఏడ్చింది. పేపర్ చూపించి ఎందిరా ఇది అని అడిగింది. దాంతో ఇక బొత్సను కలువను అని అమ్మతో చెప్పాను. ఆ తర్వాత ఐదేండ్ల తర్వాత ఈ నెల 27న మళ్లీ బొత్స సత్యనారాయణను కలిశాను. అది కూడా బొత్స ఫోన్ చేసి తన కుమారుడికి వచ్చిన నాలుగు పెండ్లి సంబంధం గురించి చెప్పాడు. ఏ సంబంధం బాగుంటుందో చూసి చెప్పమని అడిగాడు'అని బండ్ల గణేష్ తెలిపారు.