Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మార్చి 12న మై నేమ్ ఈజ్ అమృత!
కీర్తి, బేబి గాయత్రి, భానుచందర్, భానుప్రియ ముఖ్య తారాగణంగా ఆంథోని దర్శకత్వంలో యస్. ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ పతాకంపై వెంకట్ గౌని నిర్మిస్తున్న 'మై నేమ్ ఈజ్ అమృత" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్ గౌని మాట్లాడుతూ "ఓ విభిన్నమైన ప్రేమకథకు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు జత చేసి రూపొందించిన చిత్రమిది. వినోదంతో పాటు చక్కని సందేశం కూడా వుంది.
కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇటీవలె విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. పాటల చిత్రీకరణ కూడా రిచ్గా వుంటుంది. భానుచందర్, భానుప్రియల పాత్రలు అందరి మనసులు కదిలిస్తాయి. జీవా కళ్లు చిదంబరం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి సంగీతాన్ని అందించారు. ఈనెల 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.