twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మార్చి 12న మై నేమ్‌ ఈజ్‌ అమృత!

    By Sindhu
    |

    కీర్తి, బేబి గాయత్రి, భానుచందర్‌, భానుప్రియ ముఖ్య తారాగణంగా ఆంథోని దర్శకత్వంలో యస్‌. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ట్యాక్స్‌ పతాకంపై వెంకట్‌ గౌని నిర్మిస్తున్న 'మై నేమ్‌ ఈజ్‌ అమృత" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్‌ గౌని మాట్లాడుతూ "ఓ విభిన్నమైన ప్రేమకథకు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు జత చేసి రూపొందించిన చిత్రమిది. వినోదంతో పాటు చక్కని సందేశం కూడా వుంది.

    కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇటీవలె విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. పాటల చిత్రీకరణ కూడా రిచ్‌గా వుంటుంది. భానుచందర్‌, భానుప్రియల పాత్రలు అందరి మనసులు కదిలిస్తాయి. జీవా కళ్లు చిదంబరం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి సంగీతాన్ని అందించారు. ఈనెల 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X