Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పౌరాణికాలు చేసేంత పరిపక్వత నాలో లేదు: జూ ఎన్టీఆర్
తాజాగా విడుదలైన ఊసరవెల్లి ప్రోమోతోపాటు వేసవిలో విడుదలకు తయారవుతన్న 'దమ్ము" కి తయారవుతున్న జూ ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో నటించటానికి ఎప్పుడూ సై అంటారా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే 'యమదొంగ"లో పౌరాణిక పాత్రలు కూడా చెయ్యగలరనే ప్రగాఢవిశ్వాసం అందిరిలో కలిగినా, అప్పుడే కాదు అంటున్నారు జూ ఎన్టీఆర్.
'దాన వీర శూర కర్ణ" ఎన్టీఆర్ తప్పక చెయ్యాలనుకునే చిత్రమే కానీ, ఇంకా టైముంది, నాకింకా నటనలో పరిపక్వత రావాలి అని అనటం ఎన్టీఆర్ నిరాడంబరత, సౌశీల్యతలను వెల్లడిచేస్తోంది. బాబాయి బాలకృష్ణ ఇన్నాళ్ళకు 'శ్రీరామ రాజ్యం"లో పూర్తి నిడివి పౌరాణిక పాత్రలో నటించారనీ, మరో 10సంవత్సరాలు పోతే కానీ తనకూ ఆ సామర్థ్యం రాదని తారక్ అంటున్నారు.
అసలు ఇంకా పెద్ద కారణం ఏమిటంటే 2012వకు ఎన్టీఆర్ కి ఖాళీ లేదు. 'దమ్ము" తర్వాత శ్రీను వైట్లతో ఒక చిత్రం, పూరీ జగన్నాథ్ తో ఒక చిత్రం ఉన్నాయి. ఇలా కమర్షియల్ చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో ప్రయోగాత్మకంగా పౌరాణికం వైపు దృష్టి పెట్టటం వ్యాపార రిత్యా కూడా సరైన ఆలోచన కాదేమో.......