హాట్ హాట్గా నవదీప్-సదా ‘మైత్రి’(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: నవదీప్, సదా జంటగా, సూర్యరాజు కథ, దర్శకత్వాన వాసు క్రియేషన్స్ పతాకంపై సుభద్ర సమర్పణలో నిర్మాత రాజేష్ కుమార్ నిర్మించిన మైత్రి. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈచిత్రం హాట్ హాట్ ఫోటోలతో చూపరుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.

మైత్రి చిత్రంలో నవదీప్-సదా రొమాన్స్

సినిమా మొదలయినప్పటి నుంచి సదా అందాలపైనే దర్శక నిర్మాతలు ప్రత్యేక దృష్టి పెట్టారు.

తరచూ ఆమె హాట్ ఫోటోలు విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మొదట్లో ఎక్స్ ఫోజింగ్ కు దూరంగా ఉన్న సదా...అవకాశాలు తగ్గడంతో రూటు మార్చింది.

ఈ చిత్రంలో హీరో నవదీప్-హీరోయిన్ సదా మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలువ నున్నాయి.
సదా అందాల ఆరబోతతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రం.... ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. అదే విధంగా సినిమాలోని ఓ పాటలొ ప్రపంచ దేశాల్లో మన భారతదేశం గొప్పతనం గురించి, మన కట్టుబాట్లు, వ్యవహారశైలి, విలువల గురించి చెప్పినట్లు తెలిపారు.
చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో డాక్టర్ బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శీను, సుమన్ శెట్టి, భిక్షు, కళ్ళు చిదంబరం, సత్యం రాజేష్, కీర్తి, అల్లరి సుభాషిణి, జయవాణి, ఇషిక తదితరులు కనిపిస్తారు. వికాస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సెల్వ ఛాయాగ్రహణ బాధ్యతలు వహించారు. దర్శకుడు సూర్యరాజు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.


Click it and Unblock the Notifications











