Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అందుకే ఆ సీన్స్ కట్ చేస్తానన్నా ఒప్పుకున్నా...ఎన్.శంకర్
సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని సన్నివేశాలు తొలగించాలని చెప్పారు. అవి ప్రధాన ఇతివృత్తానికి ఇబ్బంది కలిగించవు. అందుకే వాటిని తీసేసేందుకు ఒప్పుకొన్నా. సెన్సార్ నుంచి అనుమతి లభించడం సంతోషాన్ని కలిగిస్తోంది అన్నారు దర్శకుడు ఎన్.శంకర్. 'జై బోలో తెలంగాణా' చిత్రానికి కొన్ని కత్తెర్లు వేసి 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సందర్బంగా చిత్ర దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ముఖ్య పాత్ర పోషించారు. తెరాస అధ్యక్షులు కె.చంద్రశేఖర్రావు ఈ చిత్రంలో ఓ పాట రాయడమే కాకుండా అతిథి పాత్రలో కనిపించారు.
ఇక ఈ 'జైభోలో తెలంగాణా' అంటూ తెలంగాణా అమరవీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్న చిత్రం డిసెంబర్ 31న విడుదల కావాల్సి వుంది. కానీ షూటింగ్ లేటవటంతో వాయిదా పడింది. అలాగే ఈ సినిమాలో తెలంగాణా వస్తున్నట్లుగా చూపించేప్రయత్నం చేశారు. కానీ మరలా మనస్సు మార్చుకుని త్వరలో వస్తుందనేట్లుగా రీ ష్యూట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.అలాగే ఎన్.శంకర్ ఈ చిత్రం గురించి చెబుతూ....తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.