Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ బయోపిక్: విఠలాచార్య పాత్రలో ప్రముఖ దర్శకుడు?
తెలుగులో సోషియో ఫాంటసీ కథలకు విఠలాచార్య పెట్టింది పేరు. ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఆయన తన సినిమాలతో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఎన్టీ రామారావు, విఠలాచార్య కాంబినేషన్లో వచ్చిన అగ్గిబరాటా లాంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు సృష్టించాయి. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో విఠలాచార్య సినిమాలు బాగా హెల్ప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్లో విఠాలాచార్య పాత్రను కూడా చూపించబోతున్నారు.
తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విఠలాచార్య పాత్రలో దర్శకుడు ఎన్ శంకర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శంకర్ పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించిన లుక్ కూడా విడుదల కాబోతోంది.
'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీ రామారావు జీవితంలోని ప్రముఖులను సినిమాలో ఎవరిని ఎంత మేర చూపించాలి అనే విషయమై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
బయోపిక్ అంటే ప్రేక్షకులు దృష్టంతా అందులో చూపించే పాత్రలు, వారి లుక్ మీదే ఉంటుంది. అందుకే పాత్రల మేకోవర్ విషయంలో సైతం క్రిష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబుు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు. ఇటీవలే రానా లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మరో రెండు నెలల్లో ముగుస్తుందని తెలుస్తోంది. వీలైతే సంక్రాంతికి లేదా ఆ తర్వాత సినిమాను విడుదల చేసే అవాకశం ఉంది. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి యి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.