Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నటుడిగా మారుతున్న తెలంగాణ శంకర్
హైదరాబాద్ : జైబోలో తెలంగాణ చిత్రం తర్వాత తెలంగాణ శంకర్గా పాపులర్ అయిన దర్శకుడు ఎన్.శంకర్ త్వరలో నటుడిగా మారబోతున్నాడు. 'రిపోర్టర్' మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయం అవుతున్నాడు. మహేష్ కత్తి దర్శకత్వంలో రామ్కీ హీరోగా ఈచిత్రం తెరకెక్కుతోంది.
నటన వైపు మరలడంపై ఎన్.శంకర్ స్పందిస్తూ..'నన్ను నటించమని కొందరు దర్శకులు అడిగినప్పుడు.... నా ఎత్తు, పొట్ట చూసిన తర్వాత నన్ను తెరపై చూపించాలనుకుంటున్నారా? అని నవ్వుకున్నాను. కానీ కథ, కథనం నచ్చడం...విలువలు గల సినిమా కావడంతో నటించడానికి ఒప్పుకున్నాను' అన్నారు.
దర్శకుడు మహేష్ కత్తి మాట్లాడుతూ..'జర్నలిస్టుల మీద సెటైర్లు వేస్తూ పలు చిత్రాలు వచ్చాయి. కానీ జర్నలిస్టులు ఎంత బాధ్యతగా ఉంటారో చెప్పే చిత్రం ఇది. ఓ గ్రామీణ రిపోర్టర్ కథ అని తెలిపారు. హీరో రామ్ కీ మాట్లాడుతూ రిపోర్టర్స్ గురించి, పాత్రికేయ విలువల గురించి గొప్పగా చూపించే సినిమా ఇది' అన్నారు. చలపతిరావు, సురేష్, తషు కౌషిక్ నటించారు. ఈ చిత్రానికి రఘు కుంచె, డాక్టర్ జోశ్యభట్ల సంగీతం అందించారు.
ఎన్.శంకర్ గురించి విషయాల్లోకి వస్తే...ఎన్ కౌంటర్ చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన ఆయన శ్రీరాములయ్య, యమజాతకుడు, జయం మనదేరా, భద్రాచలం, ఆయుధం, రామ్, జైబోలో తెలంగాణ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్కు ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు.