twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు ఎఫెక్ట్ : ‘నాయక్’ ఆడియో తేదీ, వేదిక మళ్లీ మార్పు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'నాయక్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం తేదీ, వేదిక విషయంలో మళ్లీ మార్పులు చేసారు. తాజాగా వివి వినాయక్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా......నాయక్ ఆడియో ఈనెల 14న శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

    తొలుత ఈచిత్రం ఆడియో 15న అనుకున్నారు. నెక్లెస్ రోడ్లో కార్యక్రమం నిర్వహించాలని భావించారు. అయితే ఆ తర్వాత 16వ తేదీకి మార్పు చేసి రామానాయుడు స్టూడియోలో ఫంక్షన్ చేద్దామని నిర్ణయించారు. తాజాగా మరోసారి మార్పు చేసి 14వ తేదీన శిల్పకళా వేదికలో ఆడియో వేదిక నిర్ణయించాలని ఫైనల్ చేసారు.

    ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన డేట్స్ దొరకడం కష్టం అవడం వల్లనే ఇలా మార్పులు చేయాల్సి వచ్చిందని 'నాయక్' చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

    యూనివర్సల్‌ మీడియా సంస్థ 'నాయక్‌' చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.

    English summary
    Ram Charan, Kajal and Amala Paul starring Nayak movie audio launch has been shifted to Shilpakala Vedika. It has been confirmed that the audio launch will take place in Shilpakala Vedika on December 14.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X