twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో ‘ఎన్టీఆర్ బయోపిక్’... బాలకృష్ణ, క్రిష్‌కు నోటీసులు

    By Bojja Kumar
    |

    నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ చిక్కుల్లో పడింది. ఈ సినిమాపై అభ్యంతం వ్యక్తం చేస్తూ నాదేండ్ల భాస్కర్ రావు కుటుంబం చిత్ర దర్శక నిర్మాతలకు, బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఈ సినిమాలో తన తండ్రి నాదేండ్ల భాస్కర్ రావు పాత్రను నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పెద్దకొడుకు ఈ నోటీసులు జారీ చేశారు.

    ఇక బాలయ్యకు రెండు నోటీసులు అందాయి. సినీ నటుడు హోదాలో ఆయన ఇంటికి, ఎమ్మెల్యే హోదాలో ఆయన కార్యాలయానికి ఈ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ సినిమా విషయంలో తమ కుటుంబంలోని వారి పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని నాదేండ్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    Nadendla Bhaskar Rao Family Sends Notice To Balakrishna

    మరి ఈ నోటీసుకు బాలకృష్ణ, క్రిష్ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది చర్చనీయాంశం అయింది. కాగా.... కాంగ్రెస్ నేత నాదేండ్ల భాస్కరరావు పాత్రను ప్రముఖ నటుడు పరేశ్ రావెల్ పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణతోపాటు విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సహానిర్మాతగా వ్యవహరించనున్నారు. కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. సంతోష్ తుండియిల్ కెమెరామెన్‌గా, కొటగిరి వెంకటేశ్వరరావ ఎడిటిర్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. జనవరి 9నే ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రి‌గా ప్రమాణం చేసిన డేట్ కావడంతో దాన్నే ఫైనల్ చేశారు.

    English summary
    Nadendla Bhaskar Rao Family Sends Notice To Balakrishna Regarding the NTR Biopic. The movie will feature actor Nandamuri Balakrishna in the titular role of his late father and former Chief Minister of Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X