Don't Miss!
- News వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
చిక్కుల్లో ‘ఎన్టీఆర్ బయోపిక్’... బాలకృష్ణ, క్రిష్కు నోటీసులు
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ చిక్కుల్లో పడింది. ఈ సినిమాపై అభ్యంతం వ్యక్తం చేస్తూ నాదేండ్ల భాస్కర్ రావు కుటుంబం చిత్ర దర్శక నిర్మాతలకు, బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఈ సినిమాలో తన తండ్రి నాదేండ్ల భాస్కర్ రావు పాత్రను నెగెటివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పెద్దకొడుకు ఈ నోటీసులు జారీ చేశారు.
ఇక బాలయ్యకు రెండు నోటీసులు అందాయి. సినీ నటుడు హోదాలో ఆయన ఇంటికి, ఎమ్మెల్యే హోదాలో ఆయన కార్యాలయానికి ఈ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ సినిమా విషయంలో తమ కుటుంబంలోని వారి పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని నాదేండ్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మరి ఈ నోటీసుకు బాలకృష్ణ, క్రిష్ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది చర్చనీయాంశం అయింది. కాగా.... కాంగ్రెస్ నేత నాదేండ్ల భాస్కరరావు పాత్రను ప్రముఖ నటుడు పరేశ్ రావెల్ పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణతోపాటు విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సహానిర్మాతగా వ్యవహరించనున్నారు. కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. సంతోష్ తుండియిల్ కెమెరామెన్గా, కొటగిరి వెంకటేశ్వరరావ ఎడిటిర్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. జనవరి 9నే ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన డేట్ కావడంతో దాన్నే ఫైనల్ చేశారు.