సూపర్ హిట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'నిన్నే పెళ్ళాడుతా' తర్వాత నాగ్ -కృష్ణవంశీ కలిసి చేసిన 'చంద్రలేఖ' పెద్దగా వర్కవుట్ కాలేదు. అలాగే ఆ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ ఎందుకనో గాని కలిసి పనిచేయనూలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ సీనియర్ నిర్మాత వీరిద్దరితో ఓ రొమాంటిక్ కామిడీ చేయటానికి ముందుకొస్తున్నారు. స్టోరీ లైన్ ఇప్పటికే కృష్ణవంశీ చెప్పి ఓ.కె చేయించుకున్నాడనీ సమాచారం. ప్రస్తుతం కృష్ణవంశి శశిరేఖా పరిణయం అంటూ ఓ క్యూట్ లవ్ స్టోరీనీ డైరక్ట్ చేస్తుంటే నాగార్జున కింగ్ గా కొత్తగా కనిపించి కామిడీ చెయ్యటానికి స్పీడుగా రెడీ అవుతున్నారు. ఈ సినిమా అనంతరం ఈ కొత్త సినిమా ఉండవచ్చన్నది సమాచారం. అలాగే వీరిద్దరి కాంబినేషన్ మరో మంచి చిత్రానికి నాంది అవుతుందనేది విశ్లేషకుల అంచనా. బెస్టాఫ్ లక్...