Don't Miss!
- News జగన్ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలకు ఎన్డీయే కూటమి సవాల్ ఇలా..!
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Sports Kavya Maran: తిలక్ వర్మ..నీకు దండంరా బాబు! video
- Finance Stock Market: భారీ లాభాల్లో విహరిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా బుల్స్ హవాతోనే..
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
ప్రభాస్ కోసం ఆ కథను 13ఏళ్ల క్రితమే రాసుకున్నాడట.. ఆ ఒక్క సినిమాతో దశ తిరిగింది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలని దర్శకులకు చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు, ఆశలు బాహుబలి కంటే ముందు నుంచే ఉన్నాయి. అయితే ప్రభాస్ రేంజ్ మారిన తరువాత కొంతమంది ఆలోచలనలో కూడా మార్పు వచ్చింది. ప్రభాస్ తో మనం సినిమా చెయడం అంటే చాలా కష్టం అని ఇప్పట్లో కుదరదని సీనియర్ దర్శకులు కూడా కథలు చెప్పకుండానే డ్రాప్ అయ్యారు.
అయితే నాగ్ అశ్విన్ మాత్రం అలా అనుకోలేదు. ఎలాగైనా ప్రభాస్ తో తను అనుకున్న సినిమా చేయాలని సరైన సమయం కోసం ఎదురు చూశాడు. మహానటి లాంటి బిగెస్ట్ హిట్ అందుకోవడంతో ప్రభాస్ కి అతని మీద ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే అతను ఎంచుకున్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ కోసం ఆ కథను 2007లో పదమూడేళ్ల క్రితం రాసుకున్నాడట నాగ్ అశ్విన్. ఇక ఆ ప్రాజెక్టును పాన్ ఇండియా తరహాలో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
వైజయంతి లాంటి ప్రొడక్షన్ సపోర్ట్ ఉండడంతో బడ్జెట్ కి ఎలాంటి కొదవ ఉంటుంది. ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేయాలని దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తున్నాడు. హీరోయిన్ కోసం బాలీవుడ్ సైడ్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా 2022లో రానున్నట్లు నిర్మాత సి.అశ్వినిదత్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసారు.