twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అధినాయకుడు' మారాడు

    By Staff
    |

    Nagababu
    గత కొంత కాలంగా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే టాపిక్ తో పాటు అంతే పాపులర్ అయి ఆసక్తి రేపుతున్న అంశం 'అధినాయకుడు' . చిరంజీవినీ, ఆయన రాజకీయ పార్టీనీ హైలైట్ చేసేవిధంగా 'అధినాయకుడు' ను రూపొందించింటానికి దర్శకుడు ఎన్. శంకర్ రెడీ అవుతున్నారు. ఆయన గతంలో 'ఎన్‌కౌంటర్', 'జయం మనదేరా', 'శ్రీరాములయ్య' తదితర సెమీ విప్లవ చిత్రాలు తీసి ఉన్నారు. కాగా ఇప్పుడు 'అధినాయకుడు' పై మరో వార్త అంతటా సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి నటించబోవడం లేదని, ఆ స్థానంలోకి నాగబాబు వచ్చారని. "ఆపదమ్రొక్కులవాడు" గా ఇంతకు ముందే పోసాని దర్శకత్వంలో ముందుకొచ్చిన ఆయన కూడా ఈ పాత్రకు సరిపోతాడట. అంటే 'అధినాయకుడు'గా తెరమీద నాగబాబు కనిపించబోతున్నారన్నమాట.

    ఇప్పటికే చిరంజీవి అభిమానులు ఎలా నడచుకోవాలో చెప్పే కథాంశంతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మాణమవుతోంది. దానిలో కూడా నాగబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దాంతో చిరంజీవి కొంతకాలంపాటు సినిమాలకు దూరమై, పూర్తిగా రాజకీయాల మీదే శ్రద్ధ వహిస్తారనే విషయం కన్ ఫర్మ్ అయినట్లంయింది. ఇక ఈ సినిమా స్క్రిప్టుకు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దటానికి రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు శంకర్ బ్యాంకాక్‌కు వెళ్లారుట. కె. రాఘవేంద్రరావు, అశ్వనీదత్, అల్లు అరవింద్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. సినిమాను పూర్తి చేసి డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది చిరంజీవి సంకల్పం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X