Don't Miss!
- News సీఎం జగన్ వద్దకు భూమా అఖిల ప్రియ.. తరువాత ఏం జరిగిందంటే..!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఏక్ ప్రేక్షకుడు?
కమర్షియల్ విలువలంటూ ఐటం సాంగ్ లు పెట్టినా వర్కవుట్ కాలేదని, నాసిరకం స్క్రీన్ ప్లే సినిమాను ఎనభైలనాటికి తీసుకుపోయిందని అంటున్నారు. ఇక కథలో సత్య మూర్తి(పృధ్వి) అనే లెక్చరర్ ఇద్దరు గూండాల చేతిలో చచ్చిపోతాడు. అయితే అది పెద్ద కేసు కాకుండా ఆ గూండాలు రాజకీయనాయకులను ఆశ్రయిస్తారు. అయితే ఈ హత్యకి సాక్ష్యమివ్వటానికి,కంప్లైంట్ ఇవ్వటానికి ఐదుగురు విధ్యార్ధులు ముందుకొస్తారు.వారికి మాధురి(హ్యాపీడేస్ గాయత్రి) నాయకత్వం వహిస్తూంటుంది.
నాగబాబు ఎ.సి.పి జయ చంద్రగా విభిన్నంగా కనిపించే ప్రయత్నం చేసారు.వారిని ఈ గూండాలు భయపెట్టే ప్రయత్నం చేస్తారు.ఈ లోగా అక్కడికి ఎ.సి.పి జయచంద్ర (నాగబాబు) ట్రాన్స్ ఫర్ అయి వస్తాడు. అయితే అతను కూడా విలన్స్ పక్షమే చేరి వారితో కలిసి మందు కొడుతూ ఎంజాయి చేస్తూంటాడు. అలాగే మాధురిని సైతం కిడ్నాప్ చేస్తాడు.అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాడనేది క్లైమాక్స్ లో ముడి విప్పుతాడు.
ఇక ఈ సినిమాతో నాగబాబు మరో ప్లాప్ ని తన కెరీర్ లో జత చేసుకున్నాడు. కోడి రామకృష్ణ గిన్నిస్ బుక్ రేస్ లో ఉన్నట్టున్నాడు కాబట్టి ఆయన సంగతి అస్సలు పట్టించుకోనవసం లేదు. అయితే నిర్మాత భాస్కర్ రెడ్డి మాత్ర వరసగా వివిధ హీరోలతో ఐదు సినిమాలు చేస్తానని ప్రకటించాడు. ఆయనకే ఈ సినిమా అమ్ముకుని ఉండకపోతే నష్టం. అన్నిటికన్నా ముఖ్యంగా టిక్కెట్ రేటు గిట్టుబాటు గాని ప్రేక్షకుడే పాపం అనిపిస్తాడు.అదీ సంగతి.