twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే మేమంతా ముందుకొచ్చి ఓటేస్తున్నాం : నాగేంద్రబాబు

    By Srikanya
    |

    హైదరాబాద్: మార్పు కోసమే తాము ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చినట్లు ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు అన్నారు. గతంలో ఎప్పుడూ చూసినా యూనానిమస్ అంటూ ఒకరికే కట్టబెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడా పరిస్థితిలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పారు. ఆదివారం రసవత్తరంగా మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా జయసుధ, రాజేంద్ర ప్రసాద్ పోటీ పడుతున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ కు మద్దతిస్తున్న నాగేంద్రబాబు మాట్లాడుతూ.... యూనానిమస్ కారణంగా గతంలో చిన్న చిన్న ఆర్టిస్ట్ లు మా అసోసియేషన్ వైపు రాలేకపోయారని, నేడు రాజేంద్రప్రసాద్ ముందుకొచ్చి పోటికి దిగినందున చాలామంది కామన్ ఆర్టిస్ట్ లు ముందుకొచ్చి తమ ఓటును వేస్తున్నారని, మంచి వాతావరణం నెలకొందని అన్నారు.

    మరో ప్రక్క 'మా' ఫలితాలు ఎప్పుడు వెల్లడిచేస్తామన్నది మంగళవారం తెలుస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మురళీమోహన్ తెలిపారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, తీర్పు వెలువడిన తర్వాత ఎన్నికల ఫలితాల ఎప్పుడు వెల్లడిస్తామన్న అన్న దానిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.

    Naga Babu on today's Maa elections

    మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2గంటల వరకు జరగనుంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జయసుధ,రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అలాగే సుమన్ సైతం ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలకు సంభందించిన అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు వన్ ఇండియా తెలుగు అందిస్తుంది.

    బయిటకు వచ్చాక...తనకు నమ్మకమున్న వ్యక్తికి ఓటు వేశానని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం జరుగుతున్న మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఆయనను మీడియా పలకరించింది.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మనసుకు నచ్చిన, నమ్మకమున్న వ్యక్తికి తన ఓటు ఉపయోగించానని చెప్పారు. మా పనితీరు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా.. మున్ముందు బాగుందా అనే విషయం తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ప్యానెల్ పనితీరు అనంతరం ఏ విషయమైన చెప్పగలమని అన్నారు. అలాగని, గతంలో పనిచేసిన ప్యానెల్ సరిగా పనిచేయలేదని చెప్పబోనని, వారు మంచే చేశారని, వచ్చే కొత్త ప్యానెల్ మరింత బెటర్ గా పనిచేస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు.

    తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘంలోని 702 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 'మా' అధ్యక్ష పదవి ఎన్నికపై సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల ఆసక్తి నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి జయసుధతో పాటు బొమ్మరిల్లు ధూళిపాళ్ల అనే మరో నటుడు ఉన్నారు. మా ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం పరిధిలోకి చేరినందువల్ల ఇవాళ పోలింగ్‌ మాత్రమే జరుగుతుంది. ఫలితాలు కోర్టు తుది తీర్పు తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.

    జయసుధ, రాజేంద్రప్రసాద్‌ ప్యానెళ్ల మధ్య హోరీహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్‌ జరగనుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఉన్న కోర్టు ఆదేశాల మేరకు నేడు కౌంటింగ్‌ ఉండదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికలపై సినీ జనాలతోపాటు సామాన్యులు కూడా ఆసక్తి పెంచుకున్నారు.

    English summary
    Naga Babu said he is very happy with this Movie Artists Association (MAA) elections. After taking many turns versatile actor Rajendra Prasad & Jayasudha are in the battle for MAA president post. Watch the live updates on MAA elections...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X