Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇంజనీరింగ్ స్టూడెంట్గా నటిస్తున్నా...నాగచైతన్య
కాలేజీ యువత ఐడెంటిఫై అయ్యే కథ. ఇంజనీరింగ్ స్టూడెంట్గా నటిస్తున్నా అన్నారు నాగచైతన్య. నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాగచైతన్య సరసన నాయికగా తమన్నా నటిస్తోంది. చిత్రంషూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో మాట్లాడారు.
అలాగే నిజానికి 'ఏమాయ చెసావె' తర్వాత పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చెయ్యాలనుకున్నా. కానీ ఈ కథ విన్నాక చాలా ఫ్రెష్గా ఉందనిపించింది. గీతా ఆర్ట్స్లో నటించే అవకాశం రావడం గౌరవంలాంటిది. ఈ చిత్రానికి గొప్ప టీమ్ కుదిరింది. ప్రతిభావంతులైన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈ కథపై గట్టి నమ్మకంతో ఉన్నా అన్నారు నాగచైతన్య.
అనంతరం దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఈ కథ విన్నవాళ్లంతా హీరో పాత్రకి నాగచైతన్య అయితే బాగుంటుందని చెప్పారు. హీరోయిన్గా మొదటే తమన్నాని అనుకున్నా. ఆ ఇద్దరూ ముద్దుముద్దుగా, ఫ్రెష్గా ఉన్నారు. నా సినిమాతో వాసు నిర్మాత కావడం సంతోషం. ఇది రొమాంటిక్ యాక్షన్ మూవీ అంటూ చెప్పుకొచ్చారు
ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసి మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: జె. హరిప్రసాద్, రచన: చంద్రశేఖర టి. రమేశ్, రచనా సహకారం: అర్జున్-శ్రీను, ఛాయాగ్రహణం: ప్రసాద్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్: సత్య, కథ, దర్శకత్వం: సుకుమార్.