Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సమంతని హడావిడిగా బైక్లో తీసుకెళ్లిన చైతు.. రైల్వేస్టేషన్లో పరుగులు, ఏం జరిగిందంటే!
Recommended Video
నాగ చైతన్య, సమంత గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతు, సమంత వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగ చైతన్య వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. సమంత వివాహం తరువాత కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ నటిగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా సింహాచలం రైల్వేస్టేషన్ లో సమంతని చైతు హడావిడిగా బైక్ పై తీసుకుని రావడంతో ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. అంత హడావిడిగా చైతు, సమంత రైల్వే స్టేషన్ లో ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
భార్యని బైక్పై
సమయం 10 గంటలు దాటిపోతుండడంతో నాగ చైతన్య సమంతని హడావిడిగా బైక్ పై ఎక్కించుకుని సింహాచలం రైల్వేస్టేషన్ కు తీసుకుని వచ్చాడు. బైక్ దిగగానే సమంత ఉరుకులు పరుగులు ప్రారంభించి టికెట్ కౌటర్ వద్దకు చేరుకుంది. సమంత, చైతు కావాలంటే ఖరీదైన కారులో వచ్చి విమానంలో ప్రయాణించవచ్చు. హడావిడిగా రైల్వేస్టేషన్ కు వెళ్లడం ఏంటి.. అదికూడా బైక్ లో అనే సందేహం రాక మానదు.
వివాహం జరిగాక తొలిసారి
ఇదంతా సమంత, నాగ చైతన్య నటిస్తున్న సినిమా షూటింగ్ లో భాగం. వివాహం జరిగిన తరువాత చైతు, సమంత తొలిసారి నటిస్తున్న చిత్రం ఇది. సింహాచలం రైల్వే స్టేషన్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సమంత హడావిడిగా పరిగెత్తింది టికెట్ కొనుక్కోవడానికి కాదు. టికెట్ ఇవ్వడానికి. సమంత ఈ చిత్రంలో రైల్వే బుకింగ్ కౌంటర్ ఉద్యోగి పాత్రలో నటిస్తోంది. చైతు సమంత భర్త పాత్రలో నటిస్తున్నాడు.
కిక్కిరిసిపోయిన రైల్వే స్టేషన్
సమంత, చైతు షూటింగ్ కోసం వస్తున్నారని తెలియడంతో రైల్వే స్టేషన్ ప్రాంతం మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. సమంత, చైతు వివాహం జరిగిన తరువాత తొలిసారి తమ నిర్మాణంలో నటిస్తుండడం సంతోషంగా ఉందని నిర్మాత హరీష్ తెలిపారు. కృష్ణార్జున యుద్ధం తరువాత మరోమారు సింహా చలంలో షూటింగ్ చేయడం రెండవ సారి అని ఆయన అన్నారు.
కుటుంబ కథాచిత్రం
క్రేజీ కాంబినేషన్లో తెరక్కుతున్న ఈ చిత్రం పూర్తి స్థాయిలో కుటుంబ అంశాలతో రూపొందిస్తున్నారు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ నేపథ్యంలో సింహాచలం రైల్వే స్టేషన్లో పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఏ మాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాల తరువాత మరోమారు చైతు, సమంత జంటగా నటిస్తున్నారు.