twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతల డబ్బుపై చైతూకి ఎంత ప్రేమ!

    By Bojja Kumar
    |

    Naga Chaitanya
    వరుస ప్లాపులతో సతమతం అవుతున్న నాగ చైతన్య నిర్మాతల బాగోగులపై దృష్టి పెట్టినట్లున్నాడు. అందుకే నిర్మాత బాగు కోసమే అన్నట్లు తనను తాను కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. "నా వరకు నేను సరైన జడ్జిని కాను. ఎప్పుడూ ప్రేక్షకుల పర్ స్పెక్టివ్ ఎలా ఉందో చూస్తుంటా. నా గురించి జనం ఏమనుకుంటున్నారో విని తర్వాత నా గురించి విశ్లేషించుకుంటా. సంవత్సరానికి నేను మూడు సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలుసు. అయితే సంఖ్య కోసం చూసుకొనో, లేదంటే నన్ను నేను బిజీగా ఉంచుకోవడం కోసమో ఏ నిర్మాత జీవితాన్నీ ఇబ్బందుల్లో పెట్టాలనుకోను" అని చెబుతున్నాడట.

    ఏమాయ చేశావె, '100% లవ్ సినిమాలు మంచి విజయం సాధించడంతో చైతూ కెరియర్ కి ఇక తిరుగు ఉండదు అని భావించారంతా. అయితే ఆ తర్వాత 'దడ', 'బెజవాడ' బాక్సాఫీస్ వద్ద వరుగా బోల్తాకొట్టాయి. దాంతో అంతుకు ముందు సాధించిన విజయాల తాలూకు సంతోషం లేకుండా పోయింది ఈ యువ హీరోకి.

    ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్టా దర్వకత్వంలో 'ఆటోనగర్ సూర్య' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతని సరసన సమంత రెండోసారి జోడీగా నటిస్తోంది. ఏమాయ చేశావె తరహాలో తమ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో...చూడాలి.

    English summary
    Two successive flops this year, Dhada and Bejawada, have taught Naga Chaitanya some pertinent lessons. He is not after quantity any more. He feels that doing three or more films for the sake of doing them, or just to keep himself busy, is not right.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X