నాగచైతన్య హీరోగా పరిచయమవుతున్న జోష్ చిత్రం జూలై నెలాఖరులో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అమృత్ సర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకి మూడు పాటలు మాత్రం బ్యాలన్స్ ఉన్నాయి. జూలై మొదటివారంలో రెండు పాటలు తీయనున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా వాసు వర్మ అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. నాగార్జున కుమారుడు కావటంతో ఈ చిత్రం మంచి హైప్ ని మార్కెట్లో క్రియేట్ చేస్తోంది. ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.ఇక ఈ చిత్రంలో నాగార్జున,రాధ గెస్ట్ రోల్స్ లోనూ,అనూష్క ఐటం సాంగ్ లో కనిపించనుందని వార్తలు వినపడుతున్నాయి.