Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలు.. చైతు జోరు!
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రమ్య కృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండడం కూడా ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం విషయంలో అంతా సాఫీగా జరుగుతోంది. ఆగష్టు 31 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కానీ చైతు నటిస్తున్న మరో చిత్రం సవ్యసాచి. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని చందు ముండేటి తెరకెక్కిస్తున్నాడు. ఈ పాటికే విడుదుల కావలసిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. చైతు సరసన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదుల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఒక్క సాంగ్ మినహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో సినిమా విడుదల చేసినందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇదే కనుక జరిగితే శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి చిత్రాలు రెండు నెలల వ్యవధిలో విడుదల కావడం ఖాయం.