Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ పాట చరణంతో నాగచైతన్య టైటిల్
మహేష్ బాబు,భూమిక కాంబినేషన్లో వచ్చిన ఒక్కడు చిత్రంలోని నువ్వేం మాయ చేసావో గానీ అనే పాపులర్ సాంగ్ చరణం త్వరలో టైటిల్ గా వినపడనుంది. నాగచైతన్య,గౌతం మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ఈ టైటిల్ ని నిర్ణయించారని సమాచారం. ఇంతకుముందు జెస్సీ అనీ, నాతో రా అనే రకరకాల టైటిల్ అనుకున్నారు. అయితే చివరకు ఈ టైటిల్ దగ్గర ఆగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య అసెస్టింట్ డైరక్టర్ గా చేస్తున్నారు. సమంతా అనే మోడల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అలాగే ఎ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పిబ్రవరి 14న రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. మహేష్ సోదరి మంజుల ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక నాగచైతన్య తన మూడో చిత్రానికి అజయ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేయటానికి ముందుకొచ్చాడు.ఈ చిత్రం నాగార్జున హోమ్ బ్యానర్ కామాక్షి కళా మందిర్ బ్యానర్ పై రూపొందటానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మేరకు కథా చర్చలు జరుగుతున్నాయి. ఇక నాగార్జున కూడా తన లేటెస్ట్ కేడీ చిత్రానికి కిరణ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తున్నాడు. అలాగే నాగచైతన్య,అజయ్ కాంబినేషన్ చిత్రం జనవరి 2010లో ప్రారంభం కానుంది.