Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున పుత్రోత్సాహం
నాగచైతన్య కథానాయకుడిగా ఇందిరా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మంజుల నిర్మిస్తున్న చిత్రం ప్రారంబోత్సవ కార్యక్రమం అన్నపూర్ణా స్టూడియోస్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా కృష్ణ క్లాప్ నివ్వగా ముహహూర్తపు దృశ్యానికి రామానాయుడు దర్శకత్వం వహించారు.
దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ఇదొక గుడ్ ఫీల్ మూవీ. రెండు సినిమా కుటుంబాల వారసుడితో చేస్తున్నాను కాబట్టి నామీద భాధ్యత మరింత ఎక్కువైంది. నేను ఏ సినిమా చేసినా హీరోమీద కాక స్ర్కిప్ట్ మీద నమ్మకంతో చేస్తాను. ఇదొక సంగీత ప్రాధాన్యత వున్న ప్రేమకథా చిత్రం అన్నారు. నిర్మాత సంజయ్ మాట్లాడుతూ ఈ సందర్భంగా నాగార్జునకు కృతజతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ షెడ్యూల్ నిరవధికంగా జరుగుతుంది. హైదరాబాద్, న్యూయార్క్, కేరళలలో షూటింగ్ పూర్తిచేసి డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నాము అన్నారు.
మంజుల మాట్లాడుతూ ఈ సందర్భంగా నాగార్జునకి థ్యాంక్స్ చెప్తుతున్నాను. నేనింతకాలం మా బేనర్లో మహేష్ బాబుతోనే సినిమాలు చేశాను. ఈ సినిమాను మంచి నిర్మాణాత్మక విలువలతో తీసి నాగార్జునగారికి బహుమతిగా ఇవ్వనున్నామన్నారు. నాగచైతన్య డాషింగ్ యంగ్ స్వీట్ బాయ్. ఈ సినిమా కథ చైతన్యకు మాత్రమే యాప్ట్ అవుతుంది అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ ఈ బేనర్ లో తొలుత నేనే చేద్దామనుకున్నామన్నారు. నాగచైతన్య నటుడు కాక ముందే గౌతమ్ మీనన్ ధర్శకత్వంలో చేయాలనే ఎగ్జైట్ మెంట్ అతనిలో వుండేది. ఆ కోరిక ఇప్పుడు ఈ విధంగా నెరవేరుతుందంటూ నాగచైతన్య తొలి చిత్రం విడుదల కాకముందే రెండో చిత్రం ప్రారంభమవుతోంది. ఈ సినిమా 'గీతాంజలి' తరహా సినిమా లాగా అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుందన్నారు. ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిచటం అంటున్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ ఇది ప్రేమకు ప్రాధాన్యత వున్న చిత్రం అన్నారు. నా రెండవ చిత్రమ్ ఇంత పెద్ద బ్యానర్లో ఇంత పెద్ద కాంబినేషన్ లో చేయడం, అందులోనూ గౌతం గారి దర్శకత్వంలో నటించాలనే నా కల నిజమైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా సినీ ప్రముఖులు హీరో కృష్ణ, అటనాటి కథానాయిక విజయనిర్మల మొదలగు వారు కార్యక్రమానికి హాజరయ్యారు.