Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డమరుకం దర్శకుడితో నాగచైతన్య మూవీ
హైదరాబాద్: నాగచైతన్య హీరోగా త్వరలో మరో సినిమా మొదలు కాబోతోంది. నాగార్జునతో 'డమరుకం' లాంటి భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం రూపొందించిన శ్రీనివాసరెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. 2013వ సంవత్సరంలో ఈచిత్రం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్ట దర్శకత్వంలో 'ఆటో నగర్' సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. చైతన్య ఇందులో మాస్ హీరోగా కనిపించనున్నాడు. చైతూ సరసన హాట్ హీరోయిన్ సమంత రెండోసారి రొమాన్స్ చేయబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'డమరుకం' చిత్రానికి వస్తే....ఈ చిత్రం రేపు(నవంబర్ 23) విడుదలవుతోంది. వెయ్యి సంవత్సరాల తర్వాత అంధకాసురుడు మళ్లీ పుట్టి పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, ప్రపంచాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుని సహాయంతో ఒక సామాన్య వ్యక్తి ఆ రాక్షసుడితో ఎలా పోరాడాడు, ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది ఈచిత్రం కథ.
నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, రవి శంకర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించారు. నాగార్జున కెరీర్లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమా అయిన ఈచిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి అద్భుతంగా హ్యాండిల్ చేసాడని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసిన తర్వాత హాలీవుడ్ రేంజిలో ఉందని మెచ్చుకుంటారని నాగార్జున ఇటీవల వ్యాఖ్యానించారు.