Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సునీల్, నాగచైతన్య అన్నదమ్ములుగా...
హైదరాబాద్ : నాగచైతన్య, సునీల్ హీరోలుగా శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో వాళ్లిద్దరూ అన్నదమ్ములుగా చేస్తున్నారు. తమిళ హిట్ వెట్టై రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం భలే తమ్ముడు టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. కొచెం ఇష్టం..కొంచెం కష్టం తో పరిచయమైన పి.కిశోర్కుమార్ (డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్బాబు నిర్మాతలు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో నాగచైతన్య, ఫైటర్లపై పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. వర్షంలో సాగుతుందీ ఘట్టం. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఇందులో సునీల్, నాగచైతన్య అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే ఆ సోదరులు చేసే సందడి ఆకట్టుకొంటుంది''అని తెలిపారు.
ఇక ఈ చిత్రాన్ని మొదట తెలుగులో 'భలే తమ్ముడు'గా అనువదించటానికి ప్రయత్నాలు చేసారు. మాధవన్-ఆర్యలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశించారు.అందులోనూ గతంలో వచ్చిన 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగు స్వామి ఈ చిత్రానికి దర్శకుడు కావటంతో క్రేజ్ వచ్చింది. అయితే తెలుగులో డబ్ చేయటం కన్నా రీమేక్ చేస్తేనే ఫలితాలు బాగుంటాయని బెల్లంకొండ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక వెట్టై చిత్రం యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్ సమాహారంతో రూపొందింది. తెలుగు వెర్షన్ లో మిగతా కీలక పాత్రల్లో ...బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్ప్లే: ఎ.దీపక్రాజ్, పాటలు: చంద్రబోస్, సంగీతం: తమన్.