Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగార్జున సూపర్ హిట్ సాంగ్ పై కన్నేసిన నాగ చైతన్య!
భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ నాగ చైతన్య ముందుకు పోతున్నాడు. నాగచైతన్య తాజగా నటిస్తున్న చిత్రం సవ్యసాచి. చందు ముండేటి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విభిన్న కథలతో ఆకట్టుకునే చందు ముండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాగచైతన్య తన తండ్రి నాగార్జున సూపర్ హిట్ సాంగ్ పై మనసు పడ్డట్లు తెలుస్తోంది. 'నిన్ను రోడ్డుమీద చూసినట్టు లగ్గాయితు' అనే పాట వినేవుంటారు. నాగార్జున సూపర్ హిట్ చిత్రం అల్లరి అల్లుడు చిత్రంలోనిది ఈ సాంగ్. అప్పట్లో ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఈ పాటని సవ్యసాచి చిత్రంలో రీమిక్స్ చేయాలని నాగ చైతన్య భావిస్తున్నాడట.
ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ చైతన్య నటించిన చివరి చిత్రం యుద్ధం శరణం నిరాశ పరిచింది. దీనితో చైతు ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు.