Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నాగ చైతన్య, మాధవన్ మధ్య పోటాపోటిగా... అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్గా...
ప్రేమమ్ వంటి సూపర్ సక్సెస్ అనంతరం అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం సవ్యసాచి. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూ యార్క్ లో జరుగుతోంది. త్వరలో చిత్ర యూనిట్ ఇండియా తిరిగివచ్చి మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి విడుదల తేదిని ప్రకటించబోతున్నారు.
సవ్యసాచి చిత్ర దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్గా హై టెక్నికల్ వేల్యూస్తో తెరకెక్కించబోతున్నారు. సినిమా విడుదల తరువాత ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే విధంగా సీన్స్ ఉండబోతున్నాయని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
హీరో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. విలన్ పాత్రలో మాధవాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, మాధవాన్ మధ్య వచ్చే సన్నివేశాలు పోటా పోటిగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. నాగ చైతన్య అక్కగా భూమిక నటిస్తోంది.