Don't Miss!
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగ శౌర్యతో భవ్య క్రియేషన్స్ కొత్త సినిమా ప్రారంభం
ఛలో సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య నటించబోయే కొత్త మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. కొత్త దర్శకుడు రాజా కొలుసును పరిచయం చేస్తూ భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న తొమ్మిదో చిత్రమిది.
విభిన్నమైన చిత్రాలను నిర్మించే సంస్థగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భవ్య క్రియేషన్స్ కు మంచి పేరు ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన పైసా వసూల్ తర్వాత ఈ సంస్థ నాగ శౌర్యతో సినిమాకు శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ కూకట్పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆనందప్రసాద్ సతీమణి కృష్ణ కుమారి, హీరో నాగశౌర్య తల్లి దండ్రులు ఉషా బాల, శంకరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: మహతి స్వర సాగర్, ఆర్ట్: వివేక్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: రాజా కొలుసు.