Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిక్కుల్లో నాగశౌర్య సినిమా.. ఎవరి వాదన వారిది!
నాగశౌర్య ఛలో చిత్రం విజయం తరువాత తన కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఛలో చిత్రం నాగశౌర్య కెరీర్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రం యువత, ఫ్యామిలి ఆడియన్స్ కు కనెక్ట్ కావడంతో విజయం సాధించింది.ఈ చిత్రం తరువాత చేయబోయే చిత్రం పక్కాగా ఉండాలని నాగ శౌర్య జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో ఓ వివాదం మొదలైంది. నాగశౌర్య నటించాల్సిన తదుపరి చిత్రం చిక్కుల్లో పడింది.
నాగశౌర్య డెబ్యూ డైరెక్టర్ సాయి శ్రీరామ్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రానికి ఛలో చిత్రం విడుదల కాకముందే ఈ చిత్రానికి ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఛలో చిత్రం సక్సెస్ తరువాత నాగశౌర్య తన రెమ్యునరేషన్ పెంచాడని దీనితో వివాదం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. అదీకాకుండా స్క్రిప్ట్ సరిగా లేదంటూ వంకలు పెడుతున్నాడని కూడా కోన వెంకట్ ఆరోపిస్తున్నారు.కోన వెంకట్ ఈ చిత్రానికి క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నారు. ఛలో చిత్రానికి ముందు నచ్చిన కథ ఇప్పుడు ఎందుకు నాచడంలేదో అర్థం కావడంలేదని అంటున్నారు. నాగశౌర్య ఈ చిత్రానికి సైన్ చేసిన మాట వాస్తవమే అని కానీ పూర్తి కథని వారు తమకు వివరించలేదని నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ అభిప్రాయ పడ్డారు.ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.