Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గొడవలున్నా నాగశౌర్యని హైబ్రిడ్ పిల్ల భలే పొగిడిందిగా.. నాగశౌర్య డుమ్మా కొట్టింది అందుకేనా!
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం కణం. తమిళంలో కారు పేరుతో రూపొయిందిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతోంది. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చ్ 9 న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ లో తాజగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ ఈవెంట్ కు నాగశౌర్య హాజరు కాకపోవడంతో ఉహాగానాలు మొదలవయ్యాయి.
Recommended Video
రెండు సూపర్ హిట్లు
సాయి పల్లవి నటించిన రెండు తెలుగు చిత్రాలు ఫిదా, ఎంసీఏ ఘనవిజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలతో సాయి పల్లవి తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారింది.
హ్యాట్రిక్ పై కన్ను
ఇప్పటికి రెండు విజయాలు అందుకున్న సాయి పల్లవి, కణం చిత్రంతో హ్యాట్రిక్పై కన్నేసింది. తాను తెలుగులో నటించిన ఫిదా, ఎమ్ సి ఏ వేరని, ఈ చిత్రం ఆ రెండింటి కన్నా విభిన్నమని సాయి పల్లవి తెలిపింది.
నాగశౌర్య డుమ్మా
ప్రీరిలీజ్ ఈవెంట్ కు నాగ శౌర్య హాజరు కాలేదు. దీనితో అభిమానుల్లో ఉహాగానాలు మొదలయ్యాయి.
సాయి పల్లవితో విభేదాలు
గతంలో నేరుగా మీడియా వేదికగానే నాగశౌర్య సాయి పల్లవి పై విమర్శలు చేశాడు. ఆ కారణంగానే ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదేమో అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నాగ శౌర్య పై ప్రశంసల వర్షం
నాగశౌర్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కాకున్నా సాయి పల్లవి మాత్రం అతనిపై ప్రశంసలు కురిపించింది. నాగశౌర్య అద్భుతమైన నటుడు అంటూ పొగిడేసింది. ఈ చిత్రంలో నాగశౌర్య పాత్రని ఎప్పటికి గుర్తుంచుకుంటారని తెలిపింది. ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.