Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆగావా చచ్చావే' అంటున్న నాగశౌర్య (వీడియో)
హైదరాబాద్: నాగశౌర్య, మాళవిక జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే'. ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్ను దర్శకురాలు నందినిరెడ్డి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ట్రైలర్ ఫన్నీగా సాగే డైలాగులతో నిండిపోయి సినిమాపై ఆసక్తిని కలగచేస్తోంది.
రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకులముందుకు రానుంది. కల్యాణ్ కోడూరి సంగీతం సమకూర్చారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి మనోభావాలు , ప్రేమ, పెళ్లి పట్ల వారి అభిప్రాయాలు చూపుతూ సినిమాలు తీస్తే యూత్ ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. అందుకేనేమో దర్శకురాలు నందినీ రెడ్డి ఆ పాయింట్స్ ని టచ్ చేస్తూ కళ్యాణ వైభోగమే రూపొందించింది. ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మాత.
నందిని రెడ్డి మాట్లాడుతూ... పెళ్లి తర్వాత ప్రేమలో పడిన ఓ జంట కథ ఇది. వైవాహిక బంధం వారి జీవితంలో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చింది? వారి ప్రేమపయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి అనేది తెరపై చూడాల్సిందే. కుటుంబ విలువలు, ప్రేమ, సెంటిమెంట్తో అంతర్లీనంగా చక్కటి వినోదాన్ని మేళవించి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రేమ, పెళ్లి బంధాల పట్ల నవతరం మనోభావాల నేపథ్యంలో మా చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు బి.వి. నందినిరెడ్డి.
నిర్మాత మాట్లాడుతూ.... సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి ఇచ్చిన పాటలు హిట్ అయ్యాయి నాగశౌర్య, మాళవిక నాయర్ జంట ఆకట్టుకుంటుంది. ప్రేమను సరికొత్త కోణంలో ఆవిష్కరించే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు.
రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్ మాదిరాజ్, తాగుబోతు రమేష్, ధన్రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.వి.ఎస్.రాజు, ఎడిటర్: జునైద్ సిద్దిఖ్, సహనిర్మాతలు: వివేక్ కూచిభోట్ల, జగన్మోహన్రెడ్డి.వి.