Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇంగిత జ్ఞానం కూడా లేని దర్శకుడంటూ నాగబాబు ఫైరింగ్
"నిర్మాత అనేవాడు లేకపోతే చిత్ర పరిశ్రమ సర్వ నాశనమైపోతుంది. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఉండేదట అని చరిత్రలో మనం చదువుకోవాల్సిన దుస్థితి వస్తుంది. నిర్మాత డబ్బు పెడుతుంటే...ఎన్నిరోజుల్లో సినిమా తియ్యాలి? అనే ఇంగిత జ్ఞానం కూడా లేని దర్శకులున్నారు అంటూ మండిపడుతున్నారు నాగబాబు. ఆయన తాజా చిత్రం ఆరెంజ్ విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అందులోనూ బడ్జెట్ అనుకున్న దానికన్నా ఐదారు రెట్లు పెరిగిపోవటం ఆయన కోపానికి కారణమైంది. దాంతో ఆయన రీసెంట్ గా రవితేజ తాజా చిత్రం 'మిరపకాయ్' ఆడియో పంక్షన్ కి హాజరై ఇలా తన మనస్సులోని ఆవేదనను బయిటపెట్టారు. అలాగే దర్శకులు శరీరంలోకి చేరే వైరస్ లా తయారయ్యారు. కొన్నాళ్లకు శరీరాన్ని తినేస్తుంది. దయచేసి నిర్మాతను బతకనియ్యండి. ఎంతో మంది నిర్మాతలు పరిశ్రమ నుంచి వెళ్లిపోతున్నారు. మన తెలుగు ఖ్యాతిని పెంచిన రామ్ గోపాల్ వర్మను ఆదర్శంగా తీసుకొని పనిచెయ్యండని 'మిరపకాయ్' వేడుకలో ఆవేశంగా మాట్లాడారు నాగబాబు. ఈ కార్యక్రమంలో డి.రామానాయుడు, సి.కల్యాణ్, సునీల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.