Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చెర్రీ తరుపున క్షమాపణ, దాసరిని పట్టించుకోం : నాగబాబు
హైదరాబాద్ : మొన్న 'నాయక్' సినిమా ఆడియో ఫంక్షన్ దగ్గర నుండి....నిన్న 'బాషాతో నేను' పుస్తకావిష్కరణ వరకు మెగాస్టార్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'నాయక్' ఆడియో వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ...ఓ న్యూస్ పేపర్, దాని న్యూస్ ఛానల్ పై దుమ్మెత్తి పోసారు. సదరు ఛానల్, పత్రిక నా వెంట్రుకతో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సదరు ఛానల్ నాకు, బాబాయ్ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగినట్లు దుష్పచారం, మా కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ట్రై చేస్తోందని నిప్పులు కక్కారు. ఒక రకంగా మా ఫ్యామిలీని ఎవరు టార్గెట్ చేసినా....ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు.
ఇక 'బాషాతో నేను' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దర్శక రత్న దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దాసరి వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించినవే అంటూ కొన్నీ టీవీ న్యూస్ ఛానల్స్ హోరెత్తించాయి. కొన్ని ఛానల్స్ లో దాసరి వ్యాఖ్యలపై చర్చాకార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందించారు. 'రామ్ చరణ్ చిన్న పిల్లాడు, అతని మాటలను కాకుండా ఆవేదనను అర్థం చేసుకోండి, రామ్ చరణ్ తరుపున మీడియాకు నేను క్షమాపణ చెబుతున్నాను' వివరణ ఇచ్చారు. అదే విధంగా దాసరి వ్యాఖ్యలపై మీడియాలో రేగుతున్న దుమారంపై కూడా పెదవి విప్పారు. దాసరి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు.